వారణాసి పేలుళ్ల కేసులో వలీ ఉల్లాఖాన్ కు మరణశిక్ష

Telugu Lo Computer
0


2006లో వారణాసిలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఇటీవలే దోషిగా తేలిన సూత్రధారి వలీ ఉల్లాఖాన్ కు ఘజియాబాద్ కోర్టు సోమవారం మరణశిక్ష ఖరారు చేసింది. ఆనాటి బాంబు పేలుళ్ల ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఈ మూండింటిలోనూ వలీ ఉల్లాఖాన్ కు కోర్టు మరణశిక్ష విధించింది. హత్యాయత్నం కేసులో జీవిత ఖైదు, జరిమానాను విధించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)