మిజోరాంలో భారీగా హెరాయిన్‌ పట్టివేత

Telugu Lo Computer
0


మిజోరాంలో భారీగా హెరాయిన్‌ పట్టుబడింది. లాంగ్లీ జిల్లాలోని సతీక్‌ సమీపంలో హెరాయిన్‌ తరలిస్తున్న ఇద్దరిని మిజోరాం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద 222 గ్రాముల మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో దాని విలువ రూ.1.11 కోట్లు ఉంటుందని తెలిపారు. హెరాయిన్‌ను సబ్బు పెట్టెల్లో ఉంచి తరలిస్తున్నారని, మొత్తం 17 సోప్‌ బాక్సులను సీజ్‌చేశామని వెల్లడించారు. మిజోరాంలో జరుగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. శుక్రవారం నాహ్‌తియాల్‌ జిల్లాలో 502.46 గ్రాముల హెరాయిన్‌ను పట్టుకున్నారు. దాని విలువ రూ.25 లక్షలు ఉంటుందని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)