తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి సత్తా చాటింది. ఇటీవల ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచిన ఆమె.. ఈ ఏడాది జరగబోయే కామన్వెల్త్ క్రీడల్లో బెర్త్ ఖాయం చేసుకుంది. దీనికోసం ఢిల్లీ, ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా జరిగిన అర్హత పోటీల్లో హర్యానాకు చెందిన మీనాక్షిని 7-0తో ఆమెను మట్టికరిపించింది. ఆమెతోపాటు ఒలింపిక్స్ లో కాంస్య పతకంతో భారత ఖ్యాతిని పెంచిన లవ్లీనా బోర్గోహెయిన్ కూడా కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. అలాగే నీతూ (48 కేజీల విభాగం), జాస్మిన్ (60 కేజీల విభాగం) కూడా అర్హత పోటీల్లో విజేతలుగా నిలిచారు.
కామన్వెల్త్ క్రీడలకు బెర్త్ ఖాయం చేసుకున్న నిఖత్
June 11, 2022
0