తల్లిదండ్రులను చంపిన కొడుకు

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని థానే జిల్లాలోని టిట్వాలా ప్రాంతంలో 37 ఏళ్ల అన్మోల్ భోంస్లే తన కన్న తల్లిదండ్రలనే కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తన సోదరికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. దీంతో అతని సోదరి హుటాహటినా ఇంటికి వచ్చి చూడగా తల్లిదండ్రులిద్దరూ రక్తపుమడుగులో పడి ఉన్నారు. ఇల్లంతా దుర్వాసన రావడమే కాకుండా అన్మోల్‌ కూడా ఆ మృతదేహాల పక్కనే కూర్చొని ఉన్నాడు. ఈ మేరకు ఆమె అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో దంపతులను కత్తితో పొడిచి చంపినట్లు తెలిసింని పోలీసులు చెప్పారు. మృతులు అశోక్ భోంస్లే (55), ఆయన భార్య విజయ భోంస్లే (50)గా గుర్తించామని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)