ఆర్మీ వ్యక్తి హనీట్రాప్‌ !

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆర్మీకి చెందిన 22 ఏళ్ల ప్రదీప్ కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. ఆరు నెలల కిందట పాకిస్థాన్‌కు చెందిన ఒక మహిళతో ఫేస్‌బుక్‌లో అతడికి పరిచయం ఏర్పడింది. వారిద్దరూ నాటి నుంచి వాట్సాప్‌లో చాట్‌ చేస్తున్నారు. తాను హిందూ మహిళగా ఆమె నమ్మించింది. తన పేరు ఛదం అని, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నివాసం ఉంటున్నట్లు పేర్కొంది. బెంగళూరులోని ఒక కార్పొరేట్‌ సంస్థలో పని చేస్తున్నట్లు ఆమె చెప్పింది. హనీట్రాప్‌లో చిక్కుకున్న ప్రదీప్‌ కుమార్‌ ఇటీవల ఢిల్లీ వెళ్లాడు. పెళ్లి పేరుతో ఆర్మీకి సంబంధించిన సమాచారం సంపాదించాడు. ఆ కీలక సమాచారం, చిత్రాలను పాకిస్థాన్‌ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కు చెందిన ఆ మహిళకు వాట్సాప్‌ ద్వారా పంపాడు. ఈ విషయాన్ని పసిగట్టిన రాజస్థాన్‌ పోలీసులు ఈ నెల 18న ప్రదీప్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకుని దీనిపై ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అతడ్ని అరెస్ట్‌ చేసినట్లు శనివారం ప్రకటించారు. ప్రదీప్‌ స్నేహితురాలికి కూడా ఈ నేరంతో సంబంధం ఉందని రాజస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ డీజీ ఉమేశ్‌ మిశ్రా తెలిపారు. ప్రదీప్‌ మాటలు నమ్మి ఆమె బలి పశువు అయ్యిందన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)