థాయ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు చుక్కెదురైంది. శనివారం జరిగిన సెమీస్లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ నాలుగో సీడ్ చెన్ యు ఫీ (చైనా) చేతిలో వరుస గేమ్ల్లో పరాజయం పాలైంది. కేవలం 43 నిమిషాల్లో ముగిసిన ఈ పోటీలో ఆరో సీడ్ సింధు 17-21, 16-21 తేడాతో ఓటమి చెందింది. ఈ టోర్నీ క్వార్టర్స్లో ప్రపంచ నెంబర్ వన్ అకానె యమగూచీకి షాకిచ్చి సింధు సెమీస్కు చేరిన విషయం తెలిసిందే.
సెమీస్లో పోరాడి ఓడిన సింధు
May 21, 2022
0
Tags