ఢిల్లీలో భారీ వర్షానికి ఇద్దరు మృతి

Telugu Lo Computer
0


ఢిల్లీలో సోమవారం సాయంత్రం ఉరుములు, వడగాళ్లతో కూడిన భారీ కురిసింది. 2018 తరువాత ఢిల్లీలో తీవ్రతతో కూడిన వర్షం ఇదే మొదటిసారని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 100 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయడంతో సుమారు 300 చెట్లు కూలిపోయాయి. వర్షాలు కారణంగా ఇద్దరు మరణించారు. అంగూరి భాగ్‌ ప్రాంతంలో చెట్టు కూలడంతో 65 ఏళ్ల వ్యక్తి, జామా మసీదు ప్రాంతంలో పక్కింటి బాల్కానీ కూలి 50 ఏళ్ల వ్యక్తి మరణించారు. ఉదయం నుంచి వేడిగా ఉన్న వాతావరణం సోమవారం సాయంత్రం 4.30 నిమిషాలకు ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులతో పాటు భారీ వడగళ్లు పడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)