తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన డాక్టర్ ఎం ప్రదీప్, అతని బంధువు ఎన్ రమేశ్కు కేరళలో రూ.10 కోట్ల లాటరీ తగిలింది. అయితే, వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం విదేశం నుంచి వచ్చిన తమ బంధువును ఇంటికి తీసుకువచ్చేందుకు కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్లారు. ఆ సమయంలో కేరళ విషు బంపర్ లాటరీ టికెట్ నడుస్తోంది. ఈ క్రమంలో వారిద్దరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓ ఏజెంట్ వద్ద లాటరీ టికెట్ను కొనుగోలు చేశారు. ఈ నెల 15వ తేదీన లాటరీ డ్రాలో ఊహించని రీతిలో వీరిద్దరికి జాక్పాట్ తగిలింది. డ్రాలో వీరి టికెట్కు రూ.10 కోట్ల లాటరీ తగిలింది. ఈ క్రమంలోనే లాటరీ నిర్వాహకులు వీరిని విజేతలుగా ప్రకటించారు. దీంతో వారు సోమవారం లాటరీ భవన్కు వెళ్లి టికెట్తో పాటు అవసరమైన పత్రాలు సమర్పించి రూ.10 కోట్లు తీసుకెళ్లారు.
రూ. 10 కోట్ల జాక్పాట్ కొట్టేశారు !
May 31, 2022
0