గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యపై విచారణకు హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ను పంజాబ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ తన కుమారుడి హత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్ఐఎతో సహా ఏ దర్యాప్తుకైనా తన ప్రభుత్వం సహకారం అందజేస్తుందని ఆయన చెప్పారు. హంతకులను న్యాయం ముందు నిలబెట్టేందుకు ఏ అవకాశాన్ని వదులుకోదని ముఖ్యమంత్రి మాన్ ప్రజలకు హామీ ఇచ్చారు. పంజాబ్లోని మాన్సా జిల్లాలో మూసేవాలా (28) ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. రాష్ట్ర ప్రభుత్వం అతనికి భద్రతను తగ్గించిన ఒక రోజు తరువాత ఈ ఘటన చోటుచేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఈ దాడిలో మూసేవాలాతో బాటు ఎస్యువి వాహనంలో పయనిస్తున్న అతని బంధువు, స్నేహితుడు కూడా గాయపడ్డారు. దాడి జరిగిన సమయంలో మూసేవాలా వెంట అతని అంగరక్షకులు లేరు. ఇద్దరు కమాండోలను రావద్దని చెప్పాడు.
Post Top Ad
adg
Tuesday, 31 May 2022
Home
punjab
ముఖ్యమంత్రి భగవంత్ మాన్
సిద్ధూ మూసేవాలా హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ
హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్
సిద్ధూ మూసేవాలా హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ
సిద్ధూ మూసేవాలా హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ
Tags
# punjab
# ముఖ్యమంత్రి భగవంత్ మాన్
# సిద్ధూ మూసేవాలా హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ
# హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్
About Telugu Post
హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్
Tags
punjab,
ముఖ్యమంత్రి భగవంత్ మాన్,
సిద్ధూ మూసేవాలా హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ,
హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment