గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యపై విచారణకు హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ను పంజాబ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ తన కుమారుడి హత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్ఐఎతో సహా ఏ దర్యాప్తుకైనా తన ప్రభుత్వం సహకారం అందజేస్తుందని ఆయన చెప్పారు. హంతకులను న్యాయం ముందు నిలబెట్టేందుకు ఏ అవకాశాన్ని వదులుకోదని ముఖ్యమంత్రి మాన్ ప్రజలకు హామీ ఇచ్చారు. పంజాబ్లోని మాన్సా జిల్లాలో మూసేవాలా (28) ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. రాష్ట్ర ప్రభుత్వం అతనికి భద్రతను తగ్గించిన ఒక రోజు తరువాత ఈ ఘటన చోటుచేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఈ దాడిలో మూసేవాలాతో బాటు ఎస్యువి వాహనంలో పయనిస్తున్న అతని బంధువు, స్నేహితుడు కూడా గాయపడ్డారు. దాడి జరిగిన సమయంలో మూసేవాలా వెంట అతని అంగరక్షకులు లేరు. ఇద్దరు కమాండోలను రావద్దని చెప్పాడు.
సిద్ధూ మూసేవాలా హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ
May 31, 2022
0
Tags