కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి కాదని, డబ్బులిచ్చి సీఎం అయ్యారని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. రూ.2500కోట్లు ఇస్తే తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నారంటూ కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఈ క్రమంలో సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. నగదు మార్పిడితోనే బొమ్మై సీఎం పదవికి నియమితులయ్యారు అంటూ ఆరోపించారు. అలా డబ్బులిచ్చి సీఎం అయిన ఆయన పనులు ఎందుకు చేస్తారు ? అంటూ ఎద్దేవా చేశారు. ఆయన ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి. వారి చెప్పింది చేయటమే ఆయన పని ఇక ప్రజల కోసం ఏం చేస్తారు? అంటూ ఎద్దేవా చేశారు. గత నాలుగేళ్లలో పేద ప్రజలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని.. అటువంటి ప్రభుత్వం, అటువంటి సీఎం ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 15 లక్షల ఇళ్లు నిర్మించామని, గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమి చేయనందుకు సిగ్గుపడాలని అన్నారు.
బొమ్మై డబ్బులిచ్చి సీఎం అయ్యారు !
May 09, 2022
0
Tags