ముంబైలో జరిగిన నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మార్కెట్ కా ఏకలవ్య అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ పోస్టల్ స్టాంపును కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ సంస్థ సీఈవో పద్మజ స్టేజీపై ప్రసంగిస్తున్నారు. ప్రసంగం మధ్యలో కొన్ని వాటర్ కావాలని అక్కడి సిబ్బందిని అడుగారు. స్టేజీపైనే ఉన్న నిర్మలా సీతారామన్ అది విని ఓ గ్లాసుతో పాటు వాటర్ బాటిల్ ను తెచ్చి ఇచ్చారు. దీనికి పద్మజ థాంక్యూ మేడమ్ అని చెప్పారు. స్వయంగా కేంద్ర మంత్రియే వాటర్ తెచ్చి ఇవ్వడంతో ఆ ప్రాంగణం మొత్తం చప్పట్లతో మార్మోగింది. నిర్మలా సీతారామన్ కు మద్దతుగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ వీడియోను కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రదాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. నిర్మలా సీతారామన్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ధర్మేంద్ర ప్రదాన్ షేర్ చేసిన వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తులు నిర్మలా సీతారామన్ లాగే ఉండాలంటున్నారు. మంచి మనసు చాటుకుంది అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మొత్తంగా ధర్మేంద్ర ప్రదాన్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు.
నిర్మలా సీతారామన్ చేసిన పనికి ఫిదా అయిన నెటిజన్లు !
May 09, 2022
0
Tags