పరోటా పాము చర్మం

Telugu Lo Computer
0


కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంకు చెందిన ఒక మహిళ పరోటా తినేందుకు తన కూతురుని తీసుకుని సమీపంలోని షాలిమార్ హోటల్‌కు వెళ్ళింది. పరోటా పార్సెల్ తీసుకున్న ఆ మహిళ అందులో పాము చర్మం కనిపించడంతో ఆందోళనకు గురైంది. వెంటనే విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి, ఫుడ్ సేఫ్టీ అధికారులను తీసుకురావాలని చెప్పింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులతో సహా షాలిమార్ హోటల్‌కు చేరుకున్న పోలీసులు మహిళ తీసుకున్న పార్సెల్‌ను పరిశీలించి అందులో నిజంగానే చచ్చిన పాము చర్మం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం హోటల్‌లోని వంటగదిని పరిశీలించిన అధికారులు..అక్కడున్న అపరిశుభ్ర వాతావరణం చూసి అవాక్కయ్యారు. హోటల్ వంట గదిలో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. పాత్రలు కడిగిన సందర్భం లేదని, కనీసం కిచెన్లో సరిపడా వెలుతురూ కూడా లేకపోవడం అధికారులు గుర్తించారు. మరికొన్ని ఆహార పదార్ధాలను కూడా గమనించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటిలోనూ ఏమాత్రం నాణ్యత లేదని గుర్తించారు. దీంతో హోటల్ షాలిమార్‌ను అప్పటికప్పుడు అధికారులు సీజ్ చేశారు. ఈ విషయాన్ని తుషార్ కాంత్ అనే యువకుడు ట్విట్టర్లో షేర్ చేయగా, నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇకపై హోటల్‌లో ఆహారాన్ని ముట్టనేముట్టను అంటూ ఒక నెటిజెన్ కామెంట్ చేయగా, ఇలాంటి హోటల్స్ వలన మిగతా హోటల్స్‌కు చెడ్డ పేరు వస్తుందని కామెంట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)