అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 1.11 గంటల సమయంలో క్యాంప్బెల్ బే వద్ద ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఒక ప్రకటనలో వెల్లడించింది. భూకంపకేంద్రం క్యాంప్బెల్ తీరానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. అండమాన్ దీవుల్లో పది రోజుల వ్యవధిలో భూకంపం రావడం రెండోసారి. ఏప్రిల్ 30న డిగ్లిపూర్లో 11.04 గంటలకు భూకంపం సంభవించినట్టు ఎన్సీఎస్ వెల్లడించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైందని వెల్లడించింది. ఇటీవలే ఇదే ప్రాంతంలో భూకంపం వచ్చింది. క్యాంప్బెల్ బేకు ఈశాన్యంలో 70 కిలోమీటర్ల దూరంలో భూమి ఒక్కసారిగా కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) అధికారులు పేర్కొన్నారు.
Post Top Ad
adg
Monday, 9 May 2022
Home
National
అండమాన్ దీవుల్లో భూకంపం
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ
సోమవారం తెల్లవారుజామున 1.11 గంటల సమయంలో క్యాంప్బెల్ బే వద్ద
అండమాన్ దీవుల్లో భూకంపం
అండమాన్ దీవుల్లో భూకంపం
Tags
# National
# అండమాన్ దీవుల్లో భూకంపం
# నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ
# సోమవారం తెల్లవారుజామున 1.11 గంటల సమయంలో క్యాంప్బెల్ బే వద్ద
About Telugu Post
సోమవారం తెల్లవారుజామున 1.11 గంటల సమయంలో క్యాంప్బెల్ బే వద్ద
Tags
National,
అండమాన్ దీవుల్లో భూకంపం,
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ,
సోమవారం తెల్లవారుజామున 1.11 గంటల సమయంలో క్యాంప్బెల్ బే వద్ద
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment