వాట్సాప్‌ ద్వారా మాదక ద్రవ్యాల విక్రయం

Telugu Lo Computer
0


తమిళనాడులోని చెన్నైలో వాట్సాప్‌ ద్వారా ఆర్డర్లు పొంది మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న యువతి సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక అన్నానగర్‌ సమీపంలోని ఓ మాల్‌లో ఇటీవల అనుమతి లేకుండా డీజే పార్టీలో అతిగా మద్యం సేవించి ప్రవీణ్‌ అనే యువకుడు మృతిచెందాడు. ఈ వ్యవహారంలో పార్టీ నిర్వాహకులు ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసి, మరికొందరు కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో, మాల్‌ సమీపంలో ఆదివారం సాయంత్రం అనుమానాస్పదంగా సంచరిస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ యువకుడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఆ యువకుడు అయనావరానికి చెందిన శ్రీకాంత్‌ (28) అని తెలిసింది. సాహుల్‌ హమీద్‌ (21), కోడంబాక్కంకు చెందిన టోకాస్‌ (24) అనే యువతితో కలసి శ్రీకాంత్‌ మాదకద్రవ్యాలు, స్టాంపులు విక్రయిస్తుంటాడని తేలింది. దీంతో, పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)