తమిళనాడులోని చెన్నైలో వాట్సాప్ ద్వారా ఆర్డర్లు పొంది మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న యువతి సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక అన్నానగర్ సమీపంలోని ఓ మాల్లో ఇటీవల అనుమతి లేకుండా డీజే పార్టీలో అతిగా మద్యం సేవించి ప్రవీణ్ అనే యువకుడు మృతిచెందాడు. ఈ వ్యవహారంలో పార్టీ నిర్వాహకులు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, మరికొందరు కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో, మాల్ సమీపంలో ఆదివారం సాయంత్రం అనుమానాస్పదంగా సంచరిస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ యువకుడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. ఆ యువకుడు అయనావరానికి చెందిన శ్రీకాంత్ (28) అని తెలిసింది. సాహుల్ హమీద్ (21), కోడంబాక్కంకు చెందిన టోకాస్ (24) అనే యువతితో కలసి శ్రీకాంత్ మాదకద్రవ్యాలు, స్టాంపులు విక్రయిస్తుంటాడని తేలింది. దీంతో, పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
వాట్సాప్ ద్వారా మాదక ద్రవ్యాల విక్రయం
May 31, 2022
0