కిచిడిలో ఉప్పు ఎక్కువైందని....!

Telugu Lo Computer
0


మహారాష్ట్ర థానే జిల్లాలోని భయాండర్ టౌన్‌షిప్‌లో నీలేష్ గాగ్‌ (46), నిర్మల (40) అనే దంపతులు నివాసముంటున్నారు. నిర్మల శుక్రవారం ఉదయం అల్పాహారంలో భాగంగా కిచిడి వండింది. తన భర్తకు ఉదయం 9:30 గంటల సమయంలో నిర్మల కిచిడి వడ్డించింది. కిచిడి రుచి చూసిన భర్తకు క్షణాల్లోనే కోపం కట్టలు తెంచుకుంది. ఆ ఆహారంలో ఉప్పు ఎక్కువైందని భార్యను మందలించాడు. అంతటితో ఆగకుండా ఆమె గొంతుకు బట్ట చుట్టి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)