ధరల పెరుగుదల వల్ల తగ్గిన ఇంధన వినియోగం

Telugu Lo Computer
0


పెరిగిన ధరల కారణంగా దేశవ్యాప్తంగా ఈ నెలలో ఇంధన వినియోగం గణనీయంగా తగ్గింది. పెట్రోలో, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం వల్లే గత 15 రోజుల్లో ఇంధన పెట్రోల్ వినియోగం 10శాతం తగ్గింది. డీజిల్ 15.6 శాతం తగ్గగా.. వంటగ్యాస్ వినియోగం 1.7 శాతం తగ్గింది. ఇదిలా ఉండగా.. విమానాల్లో వినియోగించే ఏటీఎఫ్‌ ఇంధనం కిలోలీటరుపై రూ.277.5 పెరిగింది. దీంతో ఏటీఎఫ్‌ ధర కిలోలీటరకు రూ.1,13,202.33కి చేరింది. ఏటీఎఫ్‌ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది ఎనిమిదోసారి.

Post a Comment

0Comments

Post a Comment (0)