ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో భీంనగరి ప్రాంతం నందు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రసంగిస్తున్న సమయంలో ఈదురు గాలులు బలంగా వీశాయి. దీంతో విద్యుత్ లైట్లు అమర్చిన ఓ భారీ ఇనుప స్తంభం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో రాజేశ్ కుమార్ అనే (50) అనే స్థానికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మాజీ ఎమ్మెల్యే గుటియారి లాల్ దూబేష్, ఆయన డ్రైవర్ కూడా ఉన్నారు. వీరందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం నుంచి కేంద్ర మంత్రి సురక్షితంగా బయటపడ్డారు.
అర్జున్ రామ్ మేఘ్వాల్ కి తృటిలో తప్పిన ప్రమాదం
April 17, 2022
0