జిగ్నేష్ మేవానికి బెయిల్ మంజూరు

Telugu Lo Computer
0


మహిళా పోలీసు అధికారిని దుర్భాషలాడడంతోపాటు దాడిచేసిన ఆరోపణలపై అరెస్ట్ అయిన గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానికి అస్సాంలోని బార్పెటా కోర్టు బెయిలు మంజూరు చేసింది. బెయిలు లభించడంతో సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేశారన్న ఆరోపణలపై ఈ నెల 20న మేవాని అరెస్టయ్యారు. ఆ కేసులో ఆయనకు సోమవారం బెయిలు లభించింది. ఆ వెంటనే ఆయనను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా పోలీసు అధికారితో అనుచితంగా ప్రవర్తించిన ఆరోపణలపై మేవాని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బెయిలు కోసం గురువారం ఆయన కోర్టును ఆశ్రయించారు. తాజాగా విచారించిన కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)