ప్రశాంత్ కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరడంలేదు !

Telugu Lo Computer
0


ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరడం లేదని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ప్రకటించారు. వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో చర్చోపచర్చలు చేశాం. కాంగ్రెస్ పునరుద్ధరణపై ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై చర్చలు కూడా జరిగాయి. దీని తర్వాత సోనియా గాంధీ సాధికారత బృందం-2024ను ఏర్పాటు చేశారు. పార్టీలో చేరి, ఈ బృందంలో బాధ్యతలు నిర్వర్తించాలని సోనియా గాంధీ ఆయనను కోరారు. అందుకు ప్రశాంత్ కిశోర్ తిరస్కరించారు అని రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. దీనిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌లో చేరాలని ఆ పార్టీ నేతలు ఆఫర్ ఇచ్చారని, అయితే దానిని తాను తిరస్కరించినట్లు పీకే ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తన కంటే పార్టీకి సమిష్టి నాయకత్వం అవసరమని తాను భావిస్తున్నానని, అలా పార్టీ సంస్థాగతంగా పటిష్టం కావాలన్నదే తన అభిమతమని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)