వడగాడ్పుల తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ 27 నుంచి మే 2వరకూ కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో యూజీ, పీజీ తరగతులను నిలిపివేస్తున్నట్టు ఒడిషా ఉన్నత విద్యా శాఖ మంగళవారం వెల్లడించింది. అయితే పరీక్షలు, ప్రశ్నా పత్రాలు దిద్దడం, నిర్వహణ, పరిశోధన పనులు వంటి కార్యకలాపాలు ఉన్నత విద్యా సంస్ధల్లో యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆయా సంస్ధల్లో బోధన, బోధనేతర సిబ్బంది విధిగా హాజరు కావాలని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. ఒడిషా రాష్ట్రంలో ఎండవేడిమి ఉధృతంగా ఉండటంతో ఏప్రిల్ 25 వరకూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు ఏప్రిల్ 30 వరకూ మూసివేస్తారని ఏప్రిల్ 25న ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది.
వడగాడ్పుల తీవ్రత దృష్ట్యా యూజీ, పీజీ క్లాసుల నిలిపివేత!
April 26, 2022
0
Tags