మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్ లో మాస్కులు ఆప్షనల్!

Telugu Lo Computer
0


మరాఠీ స్పెషల్ అయిన గుడిపడ్వా పండుగ సందర్భంగా మాస్కులు ఆప్షనల్ చేస్తూ ప్రభుత్వం ప్రజల ఇష్టానికే వదిలేసింది. ఇప్పుడు అదే పంథాలో ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ లు కూడా పయనిస్తున్నాయి. భారీ సమూహాలు, గుంపులుగా ఏర్పడ్పప్పుడు కచ్చితంగా మాస్కులు ధరించాలనే నిబంధనను ఎత్తేశాయి. పబ్లిక్ ప్లేసుల్లో ఇప్పటి నుంచి మాస్క్ ధరించని వారిపై ఎటువంటి ఫైన్ ఉండబోదని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ స్పష్టం చేసింది.  పశ్చిమ బెంగాల్ లో మార్చి 2020 తర్వాత నుంచి మొహాలకు అతుక్కుపోయిన మాస్కులను పక్కకుపెట్టేస్తున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆ నిబంధనను ఎత్తేస్తూ.. గురువారం అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి వస్తుందని బెంగాల్ గవర్నమెంట్ స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)