ఇంట్లో, ఆఫీసుల్లో ఒత్తిడి లేని, ఆహ్లాదకరంగా గడిపేందుకుగాను కంపెనీలు వారంలో 4 రోజుల పనివిధానం అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. భారత్లోని ఉద్యోగులు వారానికి 4 రోజుల పాటు డ్యూటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు హెచ్ఆర్ సొల్యూషన్స్ సంస్థ జీనియస్ కన్సల్టెంట్స్ నిర్వహించిన ఓ సర్వే తెలిపింది. ఇలా భారత్లోని 60 శాతం కంపెనీలు సుముఖంగా ఉన్నాయట !. 1,113 కంపెనీలు పాల్గొన్న సర్వేను ఫిబ్రవరి 1 నుంచి మార్చి 7 వరకు జీనియస్ కన్సల్టెంట్స్ నిర్వహించింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్స్ట్రక్షన్, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, హెచ్ఆర్ సొల్యూషన్స్, ఐటీ బీపీవో, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలకు చెందిన కంపెనీలు ఈ సర్వేలు పాల్గొన్నాయి.వారానికి 4 రోజుల పని మాత్రమే చేస్తే.. ప్రొడక్టివిటీలో మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా భావించాయి. 27 శాతం కంపెనీలు తటస్థంగా ఉన్నప్పటికీ 11 శాతం కంపెనీలు నాలుగు రోజు ల పనిదినాలతో ఉత్పాదకతో గణనీయమైన మార్పులు వస్తాయని భావిస్తున్నాయి. నాలుగు రోజుల పని మాత్రమే కాకుండా, రోజుకు 12 గంటల వరకు పనిచేసేందుకు సిద్దమని ఉద్యోగులు తెలిపారు. సర్వేలో పాల్గొన్న 52 శాతం కంపెనీలు, శుక్రవారం మూడో సెలవు ఉంటే బాగుంటుందని తెలియజేశారు. అయితే 18 శాతం కంపెనీలు, ఉద్యోగులు సోమవారం లేదంటే బుధవారం సెలవు ఉంటే పని నుంచి కాస్త బ్రేక్ దొరికినట్లుగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వారానికి 4 రోజులే పని..!
April 12, 2022
0
Tags