ఉత్తర ప్రదేశ్ లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్ పరిధి కనవాని గ్రామంలోని గోశాలలో 38 గోవులు మంటల్లో చిక్కుకొని మృతి చెందాయి. గోశాలకు సమీపంలోని డంపింగ్ యార్డులో మంటలు చెలరేగడంతో గోశాలకు అంటుకొని ఆవులు కాలి బూడిదయ్యాయని స్థానికులు తెలిపారు. శ్రీ కృష్ణ గోశాల నిర్వాహకుడు సూరజ్ పండిట్ తెలిపిన వివరాలప్రకారం మంటలు చెలరేగిన సమయంలో దాదాపు 150 ఆవులు ఉన్నాయని, దానికి సమీపంలో డంపింగ్ యార్డు ఉండటంతో మంటలు చెలరేగి గోశాలకు అంటుకున్నాయని తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ రాకేష్ కుమార్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
అగ్నిప్రమాదంలో 38 గోవులు మృతి
April 12, 2022
0