టీచర్ విధించిన శిక్షకు స్సృహ తప్పిన విద్యార్థినులు

Telugu Lo Computer
0


ఒడిశాలోని బోలంగిర్ జిల్లా పట్నాగఢ్ లోని బాపూజీ హైస్కూల్ లో  లేట్ గా వచ్చినందుకు విద్యార్ధినిలపై టీచర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. లేట్ గా వచ్చినందుకు శిక్ష అనుభవించాల్సిందేనంటూ హుకుం జారీ చేసింది. విద్యార్థినులతో 100 సార్లు గుంజిళ్లు తీయించింది. దీంతో విద్యార్ధినులు వన్ టూ త్రీ అంటూ సాధ్యమైనంత వరకు చేశారు. కానీ 100 పూర్తి చేయలేక స్పృహ తప్పి పడిపోయారు. స్పృహ తప్పిన విద్యార్థినులను అంబులెన్స్ లో పట్నాగఢ్ సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. బాలికల పరిస్థితి గమనించిన డాక్టర్లు కూడా కంగారుపడ్డారు. ఎందుకంటే వారిని ఆస్పత్రికి తీసుకువచ్చేసరికే కండీషన్ ఏమాత్రం బాగాలేదు. దీంతో డాక్టర్లు వెంటనే ప్రాథమిక చికిత్స చేశారు. కాసేపటికి విద్యార్ధినిలు కాస్తంత కోలుకున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని మెడికల్ ఆఫీసర్ పితాబాష్ షా తెలిపారు. ఈ ఘటన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ దృష్టికి వెళ్లటంతో సదరు టీచర్ పై విచారణకు ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)