దేశంలో కొత్తగా 3,303 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4.30కోట్లకు చేరాయి. ఇందులో 4.25కోట్ల మంది బాధితులు కోలుకున్నారు. ఇక కొత్తగా 39మంది మృతి చెందగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,23,693మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 16,980 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 2,563 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 188కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలో కొత్తగా 3,303 కరోనా కేసులు నమోదు !
April 28, 2022
0