ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ వేపై పేలిన కారు టైర్లు !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం ఉన్నావ్‌ వద్ద ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వెళ్తున్న కారు టైర్లు పేలిపోయాయి. దీంతో అదుపుతప్పి బోల్తాపడింది. అయితే బోల్తాపడిన కారును వెనుకనుంచి వస్తున్న మరో రెండు కార్లు ఢీకొట్టాయి. దీంతో అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను బంగార్మావు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుల్లో ఓ వ్యక్తి, మహిళ సహా ఆరు నెలల చిన్నారి ఉన్నదని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)