విమానంలో కుదుపులతో మమతకు వెన్నునొప్పి ?

Telugu Lo Computer
0


ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఆరు దశల్లో పోలింగ్ పూర్తయ్యింది. మార్చి 7వ తేదీన ఏడో దశ పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ ఎస్పీ అన్నట్లుగా ఉంది. అధికారం మరోసారి నిలబెట్టుకోవాలని బీజేపీ, ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఎస్పీ ప్రయత్నాలు చేస్తోంది. ఎస్పీకి మద్దతుగా సీఎం మమతా బెనర్జీ వారణాసికి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యలో భారీగా కుదుపులు చోటు చేసుకున్నాయి. పైలట్ చాకచక్యంతో విమానాన్ని సేఫ్ గా కోల్ కతా విమనాశ్రయంలో దింపాడు. అయితే స్వల్పంగా మమతా వెన్నునొప్పికి గురైనట్లు సమాచారం. ఇలాంటి ఘటనలపై తాము దర్యాప్తు చేయడం జరుగుతుందని, వీవీఐపీల విషయంలో అధిక ప్రాధాన్యం ఇస్తామని డీజీసీఏ అధికారి వెల్లడించారు. ఓ నివేదికను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)