కేరళలో ప్రేమికుల రోజున అరుదైన పెళ్లి జరిగింది. ఇద్దరు ట్రాన్స్జెండర్లు వివాహం చేసుకున్నారు. లింగమార్పిడి చేయించుకున్న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. శ్యామ ఎస్ ప్రభ, మను కార్తీక పదేళ్లుగా స్నేహితులు. కార్తిక ఓ ప్రైవేటు సంస్థ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. ప్రభ కేరళ ప్రభుత్వ సంక్షేమ శాఖ ట్రాన్స్జెండర్ సెల్ కో-ఆర్డినేటర్. ఐదేళ్ల క్రితమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వారు లింగమార్పిడి చేయించుకున్నారు. ప్రేమికుల రోజున తిరువనంతపురంలో బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు. అయితే ఈ రకమైన వివాహం చట్టబద్ధం కాదు. దీనిపై వారు కోర్టును ఆశ్రయించనున్నారు. తమ పెళ్లి ట్రాన్స్జెండర్ వివాహాల్లో సరికొత్త మైలురాయి కానుందని ప్రభ, మను చెప్పారు.
పెళ్లి చేసుకున్న ట్రాన్స్జెండర్లు !
February 15, 2022
0