కొత్తగా 27,409 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గుతున్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన ఈ మహమ్మారి కరోనా ప్రస్తుత వేలల్లో నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 27,409 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 4,23,127 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 93.18 శాతంగా ఉంది. నిన్న ఒక్క రోజే 347 మంది కరోనా తో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,09,358 చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో.. 82,817 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,17,60,458 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,73,42,62,440 మందికి కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా వ్యాక్సిన్లు చేసింది.  


Post a Comment

0Comments

Post a Comment (0)