ఆనంద్‌ సుబ్రమణియం అరెస్టు

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిధుల మల్లింపు కుంభకోణం కేసులో ఆనంద్‌ సుబ్రమణియంను సీబీఐ అరెస్టు చేసింది. ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ, ఆమె సలహాదారు, మాజీ గ్రూప్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ ఆనంద్ సుబ్రమణియంసంస్థకు సంబంధించిన నిధులను అక్రమ మార్గాల్లో విదేశాలకు మళ్లించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆనంద్‌ సుబ్రమణియంను సీబీఐ అధికారులు గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే చిత్రా రామకృష్ణను ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. ఆమె ఎక్కడికీ పారిపోకుండా లుకౌట్‌ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)