దేశంలో 13,166 కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతోంది. రోజువారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,166 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,94,345కి చేరింది. నిన్న302 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,13,226కి చేరింది. నిన్న 26,988 మంది  కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,22,46,884కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,34,235 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.49 శాతంగా ఉంది. ఇక రోజువారి పాజిటివిటీ రేటు కూడా 1.28 శాతంగా నమోదు అయింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 32,04,426 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,76,86,89,226 డోసులను పంపిణీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)