మధ్యప్రదేశ్ ఛతర్పూర్ పరిధి బండాలో నివాసం ఉంటున్న నందుపాల్ అనే వ్యక్తికి, లవ్కుష్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగరౌలీ గ్రామంలో నివాసం ఉంటున్న రీనా పాల్కు 2021 ఏప్రిల్లో వివాహమైంది. మరుసటి రోజే దంపతులిద్దరూ హనీమూన్ వెళ్లారు. అయితే అదే రోజే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ''నువ్వు అందంగా లేవు.. నా చదువుతో పోల్చుకున్నా నీ చదువు చాలా తక్కువ''.. అంటూ భర్తతో అనడంతో గొడవ మొదలైంది. '' అన్నీ తెలిసే కదా పెళ్లి చేసుకున్నావ్.. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావ్''.. అంటూ భర్త సర్దిచెబుతున్నా ఆమె మాత్రం వినలేదు. పెళ్లయిన మరుసటి రోజు మొదలైన గొడవ.. మూడో రోజుకు ముదిరిపోయింది. చివరకు ఇలాంటి భర్త నాకొద్దంటూ నేరుగా పుట్టింటికి వెళ్లిపోయింది. పెళ్లయిన మూడు రోజే.. ఊహించని పరిణామం ఎదురవడంతో నందుపాల్ అవాక్కయ్యాడు. ''ఒక్కసారిగా తల్లిదండ్రులను వదిలి రావడంతో, ఆ బాధలో ఇలా మాట్లాడుతోంది.. కొన్ని రోజులుంటే తిరిగి వస్తుందిలే''.. అనుకుంటూ భర్త తనకు తాను సర్దిచెప్పుకొన్నాడు. కొన్నాళ్ల తర్వాత భార్యను తీసుకురావడానికి అత్తగారింటికి వెళ్లాడు. అయితే ఆమె మాత్రం తనకు ఇష్టం లేదంటూ మళ్లీ అదే మాట మొఖం ముందే చెప్పేసింది. ఈ క్రమంలో ఓ సారి భార్యను తీసుకురావడానికి వెళ్లడంతో అత్తమామలంతా కలిసి నందపాల్పై దాడికి పాల్పడ్డారు. దీంతో తన భార్యను తనకు అప్పగించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. వారు కూడా పట్టించుకోకపోవడంతో ఏకంగా జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
పెళ్లయిన మూడో రోజే పుట్టింటికి...!
February 23, 2022
0
Tags