మహబూబాబాద్ జిల్లా ఆలేరు గ్రామానికి చెందిన యువతి(23) ఒంటరిగా ఉన్న సమయంలో గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అవమానం భరించలేని యువతి …తనపై నలుగురు గ్యాంగ్ రేప్ చేసారని వారిపేర్లు తెలుపుతూ సూసైడ్ నోట్ రాసి ఈనెల 18వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అది గమనించిన బంధువులు ఆమెను వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్ధితి విషమించటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలోనే ఉంచి బందోబస్తు నిర్వహిస్తున్నారు. గ్యాంగ్ రేప్ విషయం బయటకు పొక్కకుండా గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో గ్యాంగ్ రేప్!
February 23, 2022
0