తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించిన మెగాస్టార్ చిరంజీవి డాక్టర్ అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాజమండ్రి లోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల, ఆసుపత్రి ఆవరణలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సహకారంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. మెగాస్టార్ చిరంజీవి. అలాగే 2 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన భవనాన్ని ప్రారంభించారు చిరంజీవి. దివంగత నటుడు అల్లు రామలింగయ్య జయంతి సంధర్బంగా ఈరోజు ఆయన మనవళ్లు అల్లు స్టూడియోస్ లో సందడి చేశారు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ మరియు అల్లు బాబీలు అల్లు స్టూడియోస్ లో అల్లు రామలింగయ్యకు నివాళులు అర్పించారు. అంతే కాకుండా ఈ రోజు అల్లు రామలింగయ్య విగ్రహాన్ని అల్లు స్టూడియోస్ లో ఆవిష్కిరించారు.
అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి
October 01, 2021
0