భారత్, కజకిస్తాన్‌ క్వార్టర్స్‌ తొలి మ్యాచ్‌ 'డ్రా'

Telugu Lo Computer
0

 


ప్రపంచ మహిళల టీమ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం కజకిస్తాన్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ తొలి మ్యాచ్‌ను భారత్‌ 2-2తో 'డ్రా'గా ముగించింది. జన్సయ అబ్దుమాలిక్‌తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారిక 80 ఎత్తుల్లో... దినార సదువాకసోవాతో గేమ్‌ను ఆర్‌ వైశాలి 39 ఎత్తుల్లో 'డ్రా'గా ముగించారు. అనంతరం భక్తి కులకర్ణి 52 ఎత్తుల్లో కమలిదెనోవా చేతిలో ఓడింది. చివరగా జరిగిన గేమ్‌లో మేరీఆన్‌ గోమ్స్‌ 85 ఎత్తుల్లో గుల్మిరాపై నెగ్గడంతో మ్యాచ్‌ 'డ్రా'గా ముగిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)