తమిళనాడుకు చెందిన 53 సంవత్సరాల నజీర్ ఆలీ దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని కుటుంబసభ్యులు గత కొంతకాలం వరకు తనతోపాటే ఉన్నారు. అయితే కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోవటంతో ఆర్ధిక ఇబ్బందుల నేపధ్యంలో కుటుంబ సభ్యులను ఇండియాకు పంపించేశాడు. తానొక్కడే వుండి తిరిగి ఉద్యోగం సంపాదించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో తన స్నేహితునితో మహజూజ్ తో కలసి ఓ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడు. తాజాగా ఆలాటరీ డ్రా తీయగా అందులో నజీర్ ఆలీ కొనుగోలు చేసిన టిక్కట్టుకు రెండో బహుమతి వచ్చింది. ఇందుకు గాను ఒక మిలియన్ దిర్హమ్స్ ను గెలుచుకున్నాడు. స్నేహితులిద్దరు చెరిసంగం పంచుకోగా నజీర్ ఆలీ వాటాగా ఐదు లక్షల దిర్హమ్స్ వచ్చాయి. అంటే కోటి రూపాయల పైగా దక్కాయి