ముఖ్యమంత్రికి ఆనందయ్య లేఖ

Telugu Lo Computer
0


నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని  మందు త‌యారీ సామ‌గ్రికి సంబంధించిన మూలికలు, త‌దిత‌రాల‌కు స‌హాయం చెయ్యలంటూ లేఖ రాశారు.  ఎక్కువ మొత్తంలో మందును త‌యారు చేసి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం స‌హాయ‌ం చెయ్యాలని, మందు తయారీకి విద్యుత్ సౌక‌ర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాల‌ని లేఖ‌లో ఆనంద‌య్య పేర్కొన్న‌ారు.

మందును ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో ఆనందయ్య మందు పంపిణీ జరుగుతుంది. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ ఔషధాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇత‌ర ప్రాంతాల నుంచి వచ్చేవారిని పోలీసులు అనుమ‌తించ‌ట్లేదు. కృష్ణ‌ప‌ట్నం పంచాయ‌తీ ప‌రిధిలో 144 సెక్ష‌న్ అమ‌లు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)