కోడల్ని అమ్మిన మామ !

Telugu Lo Computer
0

 

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బారబంకీ జిల్లా మల్లాపూర్ గ్రామంలో  చంద్రరామ్ అనే వ్యక్తికి కోడలును  గుజరాత్‌కు చెందిన రామ్ గౌతమ్ అనే ముఠా సభ్యులకు రూ.80 వేల రూపాయలకు అమ్మేశాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు  భర్త స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో రైల్వే స్టేషన్ లో బాధితురాలుతో సహా మరో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. వస్తువులను అమ్మిన విధంగానే మహిళలను అమ్మి వ్యాపారం చేస్తుంటాడు చంద్రరామ్. ఇప్పటి వరకు దాదాపుగా 300 మహిళలను వివిధ వ్యక్తులకు విక్రయించినట్టు సమాచారం. ఓ హత్య కేసులో కూడా చంద్రరామ్ నిందితుడిగా ఉన్నట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)