ధర తగ్గనున్న ఎలెక్ట్రికల్ టూ వీలర్ !

Telugu Lo Computer
0


రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలను ప్రోత్సహించే దిశగా సబ్సిడీ స్కీమ్‌ FAME II స్కీమ్‌లో కేంద్రం సవరణ చేసింది. ఈ సవరణ కింద ఎలక్ట్రానిక్ టూవీలర్లపై భారీగా రాయితీలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ టూవీలర్లపై ఇదివరకు సబ్సిడీ రేటు ఒక KWhకు రూ.5 వేలు నుంచి ఉండేది. ఇప్పుడు ఈ సబ్సిడీని రూ.15 వేలుకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ISE వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఖరీదైనవే.. ఎలక్ట్రానిక్ వాహనాల ధర రూ.20 వేలు ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వాహనాలపై సబ్సిడీని పెంచింది. ఈ బైకుల ధరలు తగ్గడం ద్వారా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ టూవీలర్ల వినియోగం పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దేశంలోనే తొలి ఈవీ మేకర్, బెంగళూరు ఆధారిత తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ సబ్సిడీ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)