ఇటీవల తల్లైన ఆమె నటనకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇకపై తాను ఇంట్లోనే ఉండి తన బిడ్డ ఆరవ్ ఆలనాపాలనా చూసుకోవాలనుకుంటున్నట్లు ఆమె చెప్పారు. ‘ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇండస్ట్రీకి దూరం కావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మా బాబు సంరక్షణ చూసుకోవడం నాకెంతో ముఖ్యం. అందుకనే సినిమాలు, సీరియల్స్కు దూరంగా ఉండాలనుకుంటున్నాను. భవిష్యత్తులో తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెడతానా? లేదా? అనే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన లేదు. ప్రస్తుతానికి కొన్ని కమర్షియల్ యాడ్స్కి పనిచేస్తున్నాను. ఒకవేళ నేను తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనుకుంటే తప్పకుండా అందరికీ చెబుతాను’ అని అనిత ప్రకటించారు. ‘నువ్వు నేను’తో కథానాయికగా తెరంగేట్రం చేసి తెలుగు వారికి చేరువైయ్యారు.