హోటల్‌లో సిలిండర్‌ పేలడంతో ఆరుగురి సజీవ దహనం ?

Telugu Lo Computer
0


బీహార్‌ లోని పాట్నా జంక్షన్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. పలువురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. పాట్నాలోని రైల్వే జంక్షన్ వద్ద హోటల్‌లో మంటలు చెలరేగినట్లు ఉదయం 11 గంటలకు తమకు సమాచారం అందినట్లు అగ్నిమాపక శాఖ డీఐజీ మృత్యుంజయ్ కుమార్ తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. హోటల్‌ నుంచి సుమారుగా 30 మందిని కాపాడినట్లు తెలిపారు. సిలిండర్‌ పేలడంతో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)