అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో నౌక ఢీకొనడంతో ఒక బ్రిడ్జ్ కూలిపోయినట్లు మేరీలాండ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. 'నౌక ఢీకొనడంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలిపోయింది' అని ఎక్స్ (ట్విటర్)లో వెల్లడించింది. దీంతో పటాప్స్కో నది మీదుగా రాకపోకలు సాధ్యం కాదని డ్రైవర్లకు సూచించింది. ఈ ప్రమాదంలో వంతెనపై ఉన్న పలు వాహనాలు నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 20 మంది గల్లంతైనట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటిన భారీస్థాయి కంటైనర్ షిప్ ఈ వంతెనను ఢీకొట్టింది. దీంతో అది పేకమేడలా కూలిపోయిన దృశ్యాలు వైరల్గా మారాయి. ఆ సమయంలో వారధి మీద ఉన్న పదుల సంఖ్యలో కార్లు నదిలో పడిపోయినట్లు సమాచారం. చైనాలో గత నెల ఇదే తరహా ఘటన జరిగింది. గ్వాంగ్జూ నగరంలోని పెరల్ నదిపై ఉన్న లిజింగ్షా వంతెనను ఓ నౌక బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఒక బస్సుతో సహా ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి. ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. మరో ముగ్గురి ఆచూకీ గల్లంతైంది. ప్రమాదం అనంతరం ఈ నౌక వంతెన మధ్యే చిక్కుకుపోయింది. నదిలో పడిపోయిన బస్సులో కేవలం డ్రైవర్ మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.
నౌక ఢీకొనడంతో కుప్పకూలిన బ్రిడ్జ్ !
March 26, 2024
0
Tags