తమ డిమాండ్లను నెరవేర్చుకునే లక్ష్యంతో మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ దిశగా అన్నదాతలు కదిలారు. ఈ ఉదయం పంజాబ్, హరియాణా నుంచి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో నగరానికి బయల్దేరారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన నిఘా నివేదిక ప్రకారం.. ఒక్క పంజాబ్ నుంచే వందల సంఖ్యలో ట్రాక్టర్లు, వాహనాలు బయల్దేరతాయని, వాటిలో అన్నదాతలు ఆరు నెలలకు సరిపడా ఆహారం, ఇతర సామగ్రిని తీసుకువస్తారని తెలిపింది. కొందరు రైతులు మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వం, పోలీసులు తమ సహనానికి పరీక్ష పెట్టినా డిమాండ్లు నెరవేరేవరకు నిరసన కొనసాగిస్తామన్నారు. 'సుత్తి, రాళ్లను పగలకొట్టే పరికరాలతో సహా కావాల్సినవన్నీ మా ట్రాలీల్లో ఉన్నాయి. ఆరు నెలలకు సరిపడా రేషన్, డీజిల్తో మేం మా ప్రాంతాల నుంచి బయలుదేరాం' అని ఓ రైతు మీడియాకు వెల్లడించారు. ఆయన రెండు ట్రాలీల్లో సామగ్రిని తీసుకొని పంజాబ్లోని గురుదాస్పుర్ నుంచి దేశ రాజధానికి వస్తున్నారు. తమ యాత్రను భగ్నం చేసేందుకు ట్రాక్టర్లకు డీజిల్ దొరక్కుండా చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు. ఇదిలా ఉంటే..'ఢిల్లీ చలో' ఆందోళన ఎలా చేపట్టాలన్న దానిపై రైతు సంఘాలు రిహార్సల్ నిర్వహించాయని, కొందరు రైతులు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా సహా పలువురు భాజపా సీనియర్ నేతల ఇళ్ల ముందు నిరసన చేపట్టే అవకాశాలున్నాయని ఆ నిఘా నివేదిక పేర్కొన్న సంగతి తెలిసిందే.
సుదీర్ఘ నిరసనకు సిద్ధమైన కర్షకులు ?
February 13, 2024
0
Tags