కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే !

Telugu Lo Computer
0


కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందేనని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదని చెప్పారు. ఎన్నికల కోడ్ సాకుతో హామీలను దాటేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్నారన్న బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు ఇచ్చిందని తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)