భారత్ రక్షణ రంగంలో మరో ఘనతను సొంతం చేసుకోబోతున్నది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ ఏడాది మార్చి నాటికి ఎగుమతి ప్రారంభం అవుతుందని డీఆర్డీవో చీఫ్ సమీర్ వీ కామత్ వెల్లడించారు. ఫిలిప్పీన్స్తో పాటు పలు దేశాలు బ్రహ్మోస్ క్షిపణిపై ఆసక్తి చూపుతున్నాయన్నారు. డీఆర్డీవో ఉత్పత్తి చేస్తున్న ఎల్సీఏ ఎంకే-1ఏ, అర్జున్ ఎంకే-1ఏ, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ తదితర క్షిపణులు త్వరలోనే సైన్యంలో చేరనున్నట్లు పేర్కొన్నారు.
బ్రహ్మోస్ మిస్సైల్స్ ఎగుమతి ?
January 25, 2024
0
Tags