పాఠాలు వింటూనే కుప్పకూలిన విద్యార్ధి !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాకు చెందిన రాజా (18) అనే విద్యార్ధి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇండోర్‌లో ఉంటున్నాడు. మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల కోసం అదే జిల్లాలోని భవర్‌కువాలోని ఓ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్‌ అయ్యాడు. ప్రతి రోజూ మాదిరిగానే ఈ రోజు ఉదయం కూడా కోచింగ్‌ సెంటర్‌కు వచ్చిన రాజా క్లాస్‌ రూంలో కూర్చుని పాఠాలు వినసాగాడు. అయితే రాజా తరగతి గదిలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. చాతినొప్పితో విలవిలలాడుతూ కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్ధులు రాజాను పైకిలేపి బెంచ్‌పై కూర్చోపెట్టారు. అప్పటికే రాజా అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. క్లాస్‌ రూంలో అమర్చి ఉన్న సీసీటీవీ ఫుటేజీలో ఈ మొత్తం సంఘటన రికార్డు అయ్యింది. కోచింగ్‌ ఇన్‌స్టిట్యూ యాజమన్యం విద్యార్ధి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న మృతుడి తల్లిదండ్రులు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ తమకు పూర్తి స్థాయిలో సీసీటీవీ ఫుటేజీని అందించడం లేదని ఆరోపించారు. విద్యార్థి తండ్రి పీహెచ్‌ఈ విభాగంలో పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)