తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. గెలుపు, ఓటములతో సంబంధం లేదని సిద్ధాంతపరమైన యుద్ధం కొనసాగుతుందని చెప్పిన ఆయన, ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ట్విటర్లో పోస్టు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించిన తెలంగాణ ప్రజలకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. దొరలకు, ప్రజలకు మధ్య జరిగిన యుద్ధంలో చివరికి ప్రజలే విజయం సాధించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో దొరల పాలన సాగుతోందంటూ కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
సిద్ధాంతపరమైన యుద్ధం కొనసాగుతోంది !
December 03, 2023
0
Tags