తెలంగాణలో తొలిసారి బీజేపీ అధికారంలోకి రాబోతుంది !

Telugu Lo Computer
0


తెలంగాణలోని కరీంనగర్ లో సకల జనుల విజయసంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో మొదటిసారి అధికారంలోకి రాబోతున్నామన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. తెలంగాణలో పదేళ్లలో జరగని అభివృద్ధి వచ్చే ఐదేళ్లలో చేసి చూపిస్తామని, ప్రజలు కలలు కన్న తెలంగాణని నిర్మిస్తామన్నారు. దేశ గౌరవం పెంచడానికి బీజేపీకి ఓటు వేయండని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్‌ పార్టీ అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హామీల సంగతి పక్కన పెడితే ఆ పార్టీ అభ్యర్థులకే గ్యారంటీ లేదన్నారు. వారు గెలిస్తే బీఆర్ఎస్ లోకి పోవడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే బీఆర్ఎస్ కి ఓటు వేసినట్లే అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అన్న ప్రధాని మోడీ, ఆ రెండు పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ మాత్రమే మీ ప్రతిష్టని పెంచుతుందన్నారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ పీఎప్ఐ పుట్టుకొస్తుందన్నారు. నక్సలైట్ వ్యవస్థని బీజేపీ లేకుండా చేసిందన్నారు. బీఆర్ఎస్ వ్యవస్థను నాశనం చేసిందని మండిపడ్డారు. కరీంనగర్ నగరం స్మార్ట్ నిధులు కేంద్రం ఇస్తే, మేమే ఇచ్చామని చెప్పుకుంటున్నారు అని విమర్శించారు. ”కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ దోపిడీ చేశారు. మోడీ సర్కార్ పీఎం కిసాన్ యోజన ద్వారా రైతులకి అండగా ఉంది. కరీంనగర్ పిలిగ్రీ ఆర్ట్ కి మారు పేరు. వారిని అదుకోవడానికి పీఎం విశ్వకర్మ పథకం తీసుకొస్తాం. కరీంగనర్ ని సిల్వర్ సిటీ చేస్తాం. తెలంగాణలో బీజేపీ సర్కార్ వస్తే మోడీ గ్యారంటీగా ఉంటారు. ఒకవైపు కేసీఆర్ ఉంటే మరోవైపు మీ సేవకుడు మోడీ ఉన్నాడు. నేనంటే కేసీఆర్ కి భయం. అందుకే నేను ఉన్న దగ్గరికి రారు. కేసీఆర్ కుటుంబానికి భయం పట్టుకుంది. లిక్కర్ స్కాంలో నిందితులు బయటికి వస్తారు. దోచుకున్న సొమ్ముని కక్కిస్తాం. కాంగ్రెస్ వస్తే తెలంగాణని ఏటీఎంలా మార్చుకుంటారు. కాంగ్రెస్ వస్తే ప్రతి దగ్గర లూటీ జరుగుతుంది. కాంగ్రెస్ ని ఎప్పుడూ నమ్మకండి. బీజేపీ, మోడీపై భరోసా ఉంచండి. పనితనం చూడండి. మరొకసారి మోడీ సేవ పొందడానికి భారత దేశ ప్రజలు సిధ్ధంగా ఉన్నారు. వచ్చే ఐదేళ్లలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది” అని ప్రధాని మోడీ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)