తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా, కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్పై బదిలీ వేటు పడింది. కలెక్టర్ గోపీ, పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడును బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కలెక్టర్, సీపీని సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. కాగా, నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.
కరీంనగర్ కలెక్టర్, పోలీసు కమిషనర్పై బదిలీ వేటు !
October 27, 2023
0
Tags