అమ్మలేని ఇల్లు బోసిపోతున్నది !

Telugu Lo Computer
0


హీరో కార్తీ తన వదిన జ్యోతిక గురించి పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అందరిని ఆకట్టుకుంటున్నది. వారి కుటుంబంలోని ఆప్యాయతలకు అద్దంపట్టేలా ఉంది ఆ పోస్ట్‌. వివరాల్లోకెళ్తే, సీనియర్‌ తమిళ హీరో శివకుమార్‌ తనయులుగా తెరంగేట్రం చేసిన సూర్య, కార్తీ ప్రస్తుతం స్టార్‌ హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.వారిది మొన్నటివరకూ ఉమ్మడి కుటుంబం. అయితే ఈ మధ్య ఎందుకో సూర్య, జ్యోతిక తమ పిల్లలతో ముంబయిలో సెటిల్‌ అయ్యారు. షూటింగ్‌లు ఎక్కువగా చెన్నయ్‌లోనే ఉండటం చేత సూర్య అటూ ఇటూ తిరుగుతున్నారని సమాచారం. అయితే, ఈ విషయంపై కార్తీ తన వ్యక్తిగత సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. " అమ్మలేని ఇల్లు బోసి పోతున్నది. నేను ఆమెను వదినగా ఎప్పుడూ చూడలేదు అమ్మగానే చూశాను. తను కూడా తన పిల్లల్లో నన్నూ ఒకడిగా చూసుకుంది. ఇప్పుడు అమ్మ ఇల్లు వదిలి ముంబయ్‌లో ఉండటం బాధగా ఉంది. అమ్మలేని ఇంట్లో ఉండటం నా వల్ల కావటం లేదు. ఇన్నాళ్లూ ఈ ఇల్లు ఉమ్మడికుటుంబంలా కలిసిమెలిసి ఉందంటే కారణం అమ్మే. అందరం కలిసి ఉన్న ఆ రోజులు గుర్తొస్తే గుండె బరువెక్కుతోంది. అన్నయ్య పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. పిల్లల చదువులకోసం మాత్రమే వాళ్లు ముంబయి వెళ్లారు. ప్రస్తుతానికైతే పండగలకు కలుస్తుంటాం. మళ్లీ అందరం కలిసుండే రోజు కోసం ఎదురుచూస్తున్నా." అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు కార్తీ. అభిమానులనే కాదు, ఈ పోస్ట్‌ అందర్నీ కదిలించేలా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)